కేరళలోని కన్నూరు జిల్లాలో ఆఫ్రికన్ స్వైన్ఫ్లూ కేసు బయటపడడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. మళయంపాడిలోని ఓ ప్రైవేటు పిగ్ ఫాంలో ఈ కేసు వెలుగు చూసింది. ఆ ఫాంతోపాటు దానికి పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న మరో ఫాంలోని పందులను వధించి, నిబంధనల ప్రకారం వాటిని పాతిపెట్టాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
ఝార్ఖండ్లో 9 నెలల చిన్నారి బర్డ్ ఫ్లూ బారినపడింది. రాంగఢ్ జిల్లాకు చెందిన చిన్నారి జ్వరం, దగ్గుతోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతుండడంతో రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) వైద్యులు పరీక్షలు నిర్వహించి బర్డ్ ఫ్లూ సోకినట్టు నిర్ధారించారు. చిన్నారిని ఐసోలేషన్లో ఉంచారు.