కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో 100 మంది బాలికలు ఉండగా.. 89 మంది బాలికలు అదృశ్యమయ్యారు… 11 మంది విద్యార్థినులు మాత్రమే ఉన్నారు. ఇది ఉత్తరప్రదేశ్ లోని పరస్పూర్లోని కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో జరిగింది.
అయితే 89 మంది బాలికల మిస్సింగ్ పై వార్డెన్ సరితా సింగ్ సమాధానం చేయలేకపోయింది. ఇంత తీవ్రంగా నిర్లక్ష్యం వహిస్తున్నారని.. రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలు ఈ పద్ధతిలో నడపకూడదు అని DM మండిపడ్డారు.
రాత్రి జిల్లా మేజిస్ట్రేట్ నేహా శర్మ ఆకస్మిక తనిఖీలు చేపట్టగా ఈ విషయం బయటపడింది. దీంతో వార్డెన్తో సహా నలుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు పాఠశాల వార్డెన్, ఫుల్టైమ్ టీచర్, వాచ్మెన్, ప్రాంతీయ రక్షా దళ్ (పీఆర్డీ) జవాన్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు జిల్లా ప్రాథమిక శిక్షా అధికారి (బీఎస్ఏ) ప్రేమ్ చంద్ యాదవ్ తెలిపారు.