చంద్రయాన్‌-3 ల్యాండింగ్ విజయవంతంతో చరిత్రను సృష్టించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో…

చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో ల్యాండ్ అయిన మొదటి దేశంగా భారతదేశంగా చరిత్రను సృష్టించింది.

చంద్రయాన్‌-3 ల్యాండింగ్ ప్రక్రియను యావత్‌ భారతావని ఉత్కంఠగా వేచి చూస్తుండగా
చంద్రుని దక్షిణ ధృవం పై విక్రమ్‌ ల్యాండర్ విజయవంతంగా ల్యాండ్ అయింది.

విక్రమ్ ల్యాండర్‌ విజయవంతంగా ల్యాండ్‌ అయిన వెంటనే దక్షిణాఫ్రికాలోని జొహన్నస్‌బర్గ్‌ నుంచి లైవ్‌ను వీక్షిస్తున్న ప్రధాని మోడీ శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. చంద్రయాన్‌-3 విజయంతో భారత్‌ సరికొత్త రికార్డు సృష్టించిందని ఆయన అన్నారు.