సంఘటనలు

1970: మూడవ అలీన దేశాల సదస్సు లుసాకా లో ప్రారంభమైనది.

జననాలు

1862: వేంకట శ్వేతాచలపతి రంగారావు, బొబ్బిలి జమీందారీకి రాజు (మ1921).

1879: మొక్కపాటి సుబ్బారాయుడు, పరిపాలనా దక్షుడు, పండితుడు. (మ.1918)

1908: చెలికాని అన్నారావు, తిరుమల బాలాజీ సన్నిధిలో జీవితాన్ని చరితార్థం చేసుకున్న కార్యనిర్వహణాధికారి.

1910: త్రిపురనేని గోపీచంద్, తెలుగు రచయిత, హేతువాది, నాస్తికుడు, సాహితీవేత్త, తెలుగు సినిమా దర్శకుడు. (మ.1962)

1931: తంగి సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకరు. (మ.1984)

1933: ఆశా భోస్లే, హిందీ సినిమా గాయని.

1933: కరుటూరి సూర్యారావు, గొప్ప వ్యవసాయ, వ్యాపార, పారిశ్రామికవేత్త. (మ.2011)

1936: చక్రవర్తి, సంగీత దర్శకుడు. (మ.2002)

1951: మాధవపెద్ది సురేష్, తెలుగు సినీ సంగీత దర్శకుడు.

1975: స్వర్ణలతా నాయుడు, తెలుగు కవయిత్రి. (మ.2016)

1986: పారుపల్లి కశ్యప్, భారతదేశ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు.

1982: ఎం.ఎం . శ్రీలేఖ,సంగీత దర్శకురాలు , ఎక్కువ సంగీత చిత్రాల దర్శకురాలిగా ఘనత.

మరణాలు

1918: రాయచోటి గిరిరావు, సంఘ సేవకులు, విద్యావేత్త. (జ.1865)

1963: గరికపాటి రాజారావు, తెలుగు సినిమా దర్శకుడు, నాటకరంగ ప్రయోక్త, ఆంధ్ర ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు. (జ.1915)

1981: మాస్టర్ వేణు, తెలుగు సినిమా సంగీత దర్శకులు. (జ.1916)

1996: మైలవరపు గోపి, తెలుగు సినిమా రంగంలో ఒక ఉత్తమమైన భావాలున్న రచయిత. (జ.1949)

2012: కొడవటిగంటి రోహిణీప్రసాద్, సంగీతజ్ఞుడు, శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. (జ.1949)

2020: జయప్రకాశ్ రెడ్డి, రంగస్థల సినీ నటుడు, దర్శకుడు. (జ.1946)

2022: ఎలిజబెత్ II, యునైటెడ్ కింగ్‌డమ్ & 14 కామన్వెల్త్ రాజ్యాల రాణి. (జ.1926)

పండుగలు, జాతీయ దినాలు

అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం

ప్రపంచ శారీరక చికిత్స దినోత్సవం (ఫిజియోథెరపీ)