ప్రతి వేడుకను తీపి చేసుకుందామా.. అని ఎటువంటి కార్యక్రమం అయిన సరే స్వీట్స్ పెడుతున్నారు..మనలో చాలా మంది తీపి పదార్థాలను ఇష్టంగా తింటారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా తీపి పదార్థాలను, స్వీట్ లను ఇష్టంగా తింటూ ఉంటారు. ఏ ఆహార పదార్థానైనా తిన్న తరువాత మనం నీటిని తాగుతూ ఉంటాము. ఇది సహజమే. అయితే తీపి పదార్థాలను తిన్న తరువాత మాత్రం నీటిని తాగకూడదని నిపుణులు చెబుతున్నారు.. స్వీట్స్ తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమౌతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఎవరైనా తీపి పదార్థాలను తిన్న తరువాత నీటిని తాగితే అదే మనం చేసే అతి పెద్ద పొరపాటు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. సహజంగా తీపి పదార్థాలను తిన్న తరువాత నీటిని తాగాలనిపిస్తుంది. దీంతో మనం నీటిని తాగుతాము. ఇలా తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు మరింత వేగంగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.. మాములుగా మనం స్వీట్స్ ను తీసుకున్న తర్వాత ఆటోమెటీక్ గా చక్కర స్థాయిలు వేగంగా పెరుగుతాయి.. ఇక స్వీట్స్ తిన్న వెంటనే నీటిని తాగితే మరింత ప్రమాదామని రక్తంలో చక్కర స్థాయిలు వేగంగా పెరుగుతాయని చెబుతున్నారు..

ఇక షుగర్ వ్యాధితో బాధపడే వారు తీపి పదార్థాలను తిన్న తరువాత అస్సలు నీటిని తాగకూడదని వారు చెబుతున్నారు. ఒకవేళ తీపి పదార్థాలను తిన్న తరువాత నీటిని తాగాలనిపిస్తే నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలించి ఉమ్మి వేయాలి. లేదంటే నోట్లో ఏదైనా లవణాన్ని వేసుకోవాలి.. ఈ నీళ్ల కన్నా జ్యూస్ తాగడం బెస్ట్ అని నిపుణులు చెబుతున్నారు.. తీపి పదార్థాలను తిన్న అరగంట నుండి ముప్పావు గంట తరువాత మాత్రమే నీటిని తాగాలని అప్పుడే శరీరానికి ఎటువంటి హాని కలగకుండా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. అదన్న మాట.. ఇది గుర్తుంచుకోండి..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Source : Ntv Telugu