సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్న పలు కేటగిరీల ఉద్యోగులకు PRC కి అనుగుణంగా 23 % జీతాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

ఐఈఆర్టీ, పీటీఐ, డీపీఓ, సిస్టం ఎనలిస్టు, సైట్ ఇంజినీర్స్, డ్రైవర్లకు లబ్ధి చేకూరనుంది. జీతాలు పెంపుపై సానుకూలంగా స్పందించిన CM జగన్కు గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ధన్యవాదాలు తెలిపింది. CRP, MIS కోఆర్డినేటర్లు, డేటా ఆపరేటర్లు, అకౌంటెంట్లకు కూడా వేతనాలు పెంచాలని కోరింది.