కేరళలోని కోజికోడ్ జిల్లాలో నిపా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వచ్చే ఆదివారం వరకు అన్ని విద్యా సంస్థలను వారం రోజుల పాటు మూసివేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

జిల్లాలోని పాఠశాలలు, ప్రొఫెషనల్ కాలేజీలు, ట్యూషన్ సెంటర్లు, ఇతర విద్యా సంస్థలను మూసివేయనున్నారు.

శుక్రవారం మరో నిపా వైరస్ ఇన్‌ఫెక్షన్ నిర్ధారణ కావడంతో ఆంక్షలను కఠినతరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య ఆరుకు చేరుకుంది. నిఫా వైరస్‌ సోకి ఇద్దరు మృతి చెందారు.