ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అక్క, ప్రసిద్ధ రచయిత్రి గీతా మెహతా మృతిపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు.

ట్విట్టర్ వేదికగా ప్రసిద్ధ రచయిత్రి గీతా మెహతా మరణించినందుకు నేను బాధపడుతున్నాను. ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆమె రచనతో పాటు సినిమా నిర్మాణం పట్ల మక్కువతో ప్రసిద్ధి చెందింది. సీఎం నవీన్ పట్నాయకు, ఆమె కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను అని పేర్కొన్నారు.