చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో నారా భువనేశ్వరితో పాటు నారా బ్రాహ్మణి పాల్గొన్నారు.

ఎన్నికల్లో లబ్ధికోసమే ఇలాంటి పనులు చేస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. రాజకీయ దురుద్దేశంతోనే TDP అధినేత చంద్రబాబును జైలుకు పంపారని… చంద్రబాబు, లోకేశ్కు ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూసి ఓర్వలేకే ఇదంతా చేస్తున్నారని విమర్శించారు.