జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. అనంత్నాగ్ జిల్లాలో గత 4 రోజులుగా జరుగుతున్న ఎన్ కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
మరో ఇద్దరు టెర్రరిస్టులు ఉన్నట్లు డ్రోన్ కెమెరాలో రికార్డు అయింది. మరోవైపు బారాముల్లా జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలతో పాటు భారత్, పాకిస్తాన్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.