విశ్వకర్మ జయంతి సందర్భంగా చేతి వృత్తుల వారి కోసం ప్రధాని మోదీ కొత్త పథకం ప్రారంభించారు. రూ .13 వేల కోట్లతో పీఎం విశ్వకర్మ పథకానికి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా ఢిల్లీలోని ద్వారకలో ఏర్పాటు చేసిన ఎక్స్పోలో పలు చేతి వృత్తులను పరిశీలించారు. వివిధ చేతివృత్తులను పరిశీలించి వారితో కొంతసేపు ముచ్చటించారు. అంతకు ముందు విశ్వకర్మకు ఆయన నివాళి అర్పించారు.