కాంగ్రెస్ నేతలకు సోనియా గాంధీ కీలక సూచనలు చేశారు.

మీడియా ముందుకు వచ్చినప్పుడు చాలా సంయమనం పాటించాలన్నారు. మీడియా ముందు పొరపాటుగా చేసిన చిన్న వ్యాఖ్య అయినా అది కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బ తీస్తుందన్నారు. వ్యక్తిగత అభిప్రాయాలను పెట్టి పార్టీ గెలుపు కోసం అవిశ్రాంతంగా పని చేయాలని కోరారు. ఐక్యత క్రమశిక్షణతోనే విరోధులను జయించగలమని ఇది కర్ణాటక ఎన్నికల్లో నిరూపితమైందని గుర్తు చేశారు.