ప్రముఖ సోషల్ మీడియా సంస్థ వాట్సాప్ తీసుకువచ్చిన ‘ఛానెల్స్’ లో ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేరారు.
కొద్ది రోజుల్లోనే ఆయనను 50 లక్షల మంది అనుసరించడం ప్రారంభించారు. ‘వాట్సప్ ఛానల్ ద్వారా మీరంతా నాతో అనుసంధానం కావడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నా. భవిష్యత్తులో మరిన్ని అంశాల గురించి మనం మాట్లాడుకుందాం’ అని ప్రత్యేక పోస్టులో మోదీ పేర్కొన్నారు.