గృహలక్ష్మి పథకంపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. సొంతంగా స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే పేదల కోసం గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించామని తెలిపారు.
లబ్ధిదారులకు గృహ నిర్మాణం కోసం మూడు దశల్లో రూ .3 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. మొదటి దశలో ప్రతి నియోజకవర్గంలో మూడు వేల మందికి ఈ ప్రయోజనం చేకూరుతుందని కేసీఆర్ తెలిపారు.