తెలంగాణలో వచ్చే ఐదు రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుందని పేర్కొంది. వీటి ప్రభావంతో అక్టోబర్ ఒకటి వరకు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.