భారతీయుల్లో ఉప్పు వాడకం ఎక్కువగా తీసుకుంటున్నారని తాజా అధ్యయనంలో గుర్తించారు వైద్యులు.

ప్రతిరోజూ ఆహారం ద్వారా సగటు భారతీయుడు 8 గ్రాముల ఉప్పు తీసుకుంటున్నాడని, ఇది వైద్యులు సూచించిన పరిమితి (5 గ్రాములు) కన్నా 3 గ్రాములు ఎక్కువగా ఉందని తాజా అధ్యయనం తేల్చింది. ఉప్పు ఎక్కువగా తీసుకునేవారు గుండెపోటు, స్ట్రోక్స్, క్యాన్సర్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.