పంజాబ్ లో రేపటి నుంచి మూడు రోజులపాటు రైల్ రోకోకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.
రైతు సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కిసాన్ మజ్దాూర్ సంఘర్ష్ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వన్ సింగ్ ప్రకటించారు. రుణమాఫీతో పాటు, ఇటీవల వరదల్లో నష్టపోయిన పంటలకు నష్టపరిహారం ప్రకటించాలని, ఎంఎసీపీకి చట్టబద్ధ హామీ కల్పించాలన్న డిమాండ్లతో ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు.