న్యాయమూర్తుల నియామకాలు, బదిలీలకు సంబంధించి కొలీజియం చేసిన 70 సిఫార్సులు కేంద్ర ప్రభుత్వం వద్ద చాలా కాలంగా పెండింగ్లో ఉండడంపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది.

వీటిని పరిష్కరించటానికి ప్రయత్నించాలని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణికి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాంశు ధూలియాలతో కూడిన ధర్మాసనం సూచించింది. దీంతో తనకు వారం రోజుల వ్యవధి ఇవ్వాలని, ప్రభుత్వాన్ని సంప్రదించి చెబుతానంటూ అటార్నీ జనరల్ పేర్కొన్నారు.