దేశంలోని మూడు రాష్ట్రాలకు బీజేపీ తమ నూతన అధ్యక్షులను నియమించింది.
పుదుచ్చేరి అధ్యక్షుడిగా ఎస్ సెల్వగణపతి, నాగాలాండ్ అధ్యక్షుడిగా బెంజమిన్ యెప్తోమి, మేఘాలయ అధ్యక్షుడిగా రిక్మాన్ మోమిన్ను నియమించినట్లు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా తెలిపారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాల పార్టీ కార్యాలయాలకు నోటీసులు పంపించారు. పార్టీ నేతలంతా వారికి సహకరించాలని కోరారు.