ప్రధాని మోదీకి పలు సందర్భాల్లో వచ్చిన 912 బహుమతులు, జ్ఞాపికలను వేలానికి పెట్టారు.
ఈ నెల 31 వరకు వేలం సాగనుండగా.. వచ్చిన సొమ్మును ‘నమామి గంగే ప్రాజెక్టు’కు ఇవ్వనున్నారు. ఈ వేలంలో ‘నమామి గంగే ప్రాజెక్టు’కు తమ వంతు సహకారాన్ని అందించాలని పౌరులను కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి కోరారు. ఆసక్తి కలవారు https:// pmmementos.gov.in/ ను సందర్శించి వేలం ప్రక్రియలో పాల్గొనవచ్చు.