పాకిస్థాన్, మస్తుంగ్ జిల్లాలో మహ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకుని భక్తుల ర్యాలీలో ఓ ఉగ్రవాది తనను తాను పేల్చేసుకోవడంతో 52మంది ప్రాణాలు కోల్పోగా మరో 50కి పైబడిన వారు గాయపడ్డారు.
తర్వాత, ఖైబర్ పఖ్తుంఖ్వాలోని హంగూ నగరంలోని మసీదులో జరిగిన మరో పేలుడులో కనీసం నలుగురు వ్యక్తులు మరణించగా 12 మంది గాయపడ్డారు.
ఈ ఆత్మాహుతి దాడికి ఇప్పటి వరకు ఎవరూ బాధ్యత ప్రకటించలేదు. ఈ పేలుడుతో తమకు సంబంధం లేదని ‘ది పాకిస్థాన్ తాలిబన్’ (టీటీపీ) స్పష్టం చేసింది.