మరో మలేరియా టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆమోదం తెలిపింది.

భారత్ కు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సహకారంతో ఆక్స్ఫర్డ్ వర్సిటీ ఈ టీకా రూపొందించింది.

మూడు డోసుల ఈ వ్యాక్సిన్.. 75శాతం ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు. మొదటి టీకా కంటే ఇది మరింత సమర్థమైందని WHO చీఫ్ టెడ్రోస్ అథనామ్ తెలిపారు. కాగా 2021లో జీఎస్కే సంస్థ రూపొందించిన తొలి టీకా WHO ఆమోదం తెలిపింది.