రామగుండం NTPC తెలంగాణ విద్యుత్ ప్రాజెక్టును దేశ ప్రధాని మోదీ నేడు జాతికి అంకితం చేయనున్నారు.
నిజామాబాద్లో జరిగే ప్రధాని మోదీ సభ నుంచి ఈ రోజు మధ్యాహ్నం వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారు.
ఈ క్రమంలో NTPC పర్మనెంట్ టౌన్ షిప్ లోని కాకతీయ ఆడిటోరియంలో అధికారులు డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ప్రాజెక్ట్ మొదటి దశ 800 మెగావాట్ల యూనిట్లను యాజమాన్యం వాణిజ్య ఉత్పత్తిలోకి తీసుకువచ్చింది.