నిన్న జిల్లా పోలీస్​ ఆఫీస్​లో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నెలవారి రివ్యూ మీటింగ్​ నిర్వహించారు ఎస్పీ సింధూశర్మ.

ఈ మీటింగ్ ఆమె మాట్లాడుతూ… మహిళల రక్షణకు పెద్దపీట వేయలన్నారు. మిస్సింగ్​ కేసులపై స్పెషల్ ఫోకస్​ పెట్టాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించవొద్దన్నారు.

ప్రతీ ఆఫీసర్​ పారదర్శకంగా డ్యూటీ చేయాలని సూచించారు. సైబర్​ నేరాల బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. స్టేషన్ల వారీగా పెండింగ్​లో ఉన్న కేసులపై సమీక్షించారు.

అనంతరం సైబర్​ నేరాలకు సంబంధించిన అవగాహన పోస్టర్​రి లీజ్​చేశారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపిన ఆఫీసర్లు, సిబ్బందికి అవార్డులు అందించారు.

ట్రైనీ ఐపీఎస్​ కాజల్​సింగ్, అడిషనల్​ ఎస్పీ నరసింహారెడ్డి, డీఎస్పీలు ప్రకాశ్,శ్రీనివాస్, జగన్నాథ్​రెడ్డి, మదన్​లాల్, శ్రీనివాస్, ఎస్బీ సీఐ సంతోష్​కుమార్​ పాల్గొన్నారు.