కవ్వాల్ టైగర్ రిజర్వు నుంచి గ్రామాల తరలింపునకు రంగం సిద్ధమైంది. నిర్మల్ జిల్లా కడెం మండలం మైసంపేట, రాంపూర్ గ్రామాలను కోర్ ఏరియా వెలుపల ఉన్న ఇదే మండలంలోని ధర్మాజిపేటకు తరలించనున్నారు.

ఈ గ్రామంలోనే వారికి పునరావాసం కల్పించనున్నారు. వారికి డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తయింది. రాష్ట్రప్రభుత్వం తేదీ నిర్ణయించగానే వారిని ధర్మాజిపేటకు తరలించనున్నట్లు అటవీశాఖ వర్గాలు తెలిపాయి.