సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గా శుక్రవారం సుప్రీంకోర్టులో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ముందు రెండు విస్కీ బాటిళ్లను తీసుకువచ్చి పెట్టారు.

పెర్నోడ్ రికార్డ్ కంపెనీ, జేకే ఎంటర్ప్రైజెస్ మధ్య జరుగుతున్న ట్రేడ్ మార్క్ వివాదంలో మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పుపై దాఖలైన అప్పీలు విచారణ సందర్భంగా ఈ సంఘటన జరిగింది.

రెండు ప్రొడక్ట్స్ మధ్య సారూప్యతలను చూపించడానికే వాటిని తీసుకువచ్చినట్లు రోహత్గా తెలిపారు.