ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరించారు.

దుండగుల దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సిబ్బందిని ఆయన పరామర్శించారు. సిబ్బంది ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఈ తరహా దాడులకు పాల్పడితే యాజమాన్యం సహించబోదని స్పష్టం చేశారు. పోలీసు శాఖ సహకారంతో నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామన్నారు.