మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. గూడూరు మండలం బొల్లేపల్లిలో మంత్రాల నెపంతో కుమారస్వామి అనే వ్యక్తి తల్లి, కొడుకును రాడ్డుతో కొట్టి చంపాడు. దీంతో బొద్దమ్మ(50), సమ్మయ్య (35) ప్రాణాలు కోల్పోయారు.
ఏడేళ్లుగా మృతుల కుటుంబానికి, నిందితుడి కుటుంబానికి మధ్య గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.