మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వర్గాన్ని నిజమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీగా ఎన్నికల సంఘం గుర్తించడాన్ని సవాల్ చేశారు.
ఇటీవల ఎన్సీపీ గుర్తు(గడియారం) సైతం అజిత్ పవార్ వర్గానికి చెందుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. కాగా వ్యవస్థాపకుల చేతుల్లో నుంచి లాక్కొని ఇతరులకు పార్టీని అప్పగించిందని ఎన్నికల సంఘంపై శరద్ పవార్ ఆరోపణలు గుప్పిస్తున్నారు.