ఎండల తీవ్రత మొదలవడంతో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరింది. ఈ నెల 23న రాష్ట్రంలో 15,031 మెగావాట్ల (గత ఏడాది ఇదే రోజున 14,526 మెగావాట్లు) గరిష్ఠ డిమాండ్ నమోదైంది.
ఫిబ్రవరిలో విద్యుత్ వినియోగం 15 వేల మెగావాట్లను దాటడం ఇదే తొలిసారి. గత ఏడాది మార్చి 30న అత్యధికంగా 15,497 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదుకాగా, ఈ ఏడాది అదే సమయానికి 16,500 మెగావాట్లు మించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.