సీఎం జగన్ ఈ రోజు కుప్పంలో పర్యటించనున్నారు. రామకుప్పం మండలం రాజుపేటలో హంద్రీ నీవా ద్వారా కృష్ణా జలాలను విడుదల చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు.
ఆ తర్వాత గుండిశెట్టిపల్లి వద్ద ఫొటో ఎగ్జిబిషన్ను పరిశీలించి, బహిరంగసభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. హంద్రీ నీవా ప్రాజెక్టుతో 6,300 ఎకరాలకు సాగునీరు, కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లోని 4.02 లక్షల జనాభాకు తాగు నీరు అందుతుందని అధికారులు చెబుతున్నారు.