కశ్మీర్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమేనని, గతంలో, ఇప్పుడు, భవిష్యత్తులోనూ భాగంగానే ఉంటుందని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా స్పష్టం చేశారు.
దేశ వైవిధ్యాన్ని కాపాడినప్పుడే అది మరింత పటిష్ఠంగా ఉంటుందన్నారు. బెంగళూరులో ఆయన మాట్లాడుతూ.. ‘మతం మనల్ని విభజించదు. అది ఏకం చేస్తుంది. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను సమష్ఠిగా ఎదుర్కొని ఒకరికొకరు అండగా నిలబడితే మనం ముందుకెళ్లగలం’ అని పేర్కొన్నారు.