నాలుగు రోజుల పాటు మహానగరంగా మారిన మేడారం బోసిపోయింది. జాతర ముగియడంతో ఆదివారం సాయంత్రం భక్తుల రద్దీ తగ్గిపోయింది.

వ్యాపారులు దుకాణాలు మూసి తిరుగుముఖం పట్టారు. జంపన్న వాగు నిర్మానుష్యంగా మారింది. దీంతో మేడారం పరిసరాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నాలుగు రోజుల పాటు సందడిగా మారిన జాతర పరిసరాలు నిశ్శబ్దంగా మారుతూ మేడారం పాత రూపు సంతరించుకుంటుంది.