రాష్ట్రంలో ఎన్నికల భేరికి బీజేపీ సమాయత్తమైంది. ఏలూరులో మంగళవారం 16 వేల మంది పోలింగ్ బూత్ స్థాయి ఏజెంట్లతో భారీ సమావేశం నిర్వహిస్తోంది.

రాష్ట్రాన్ని ఐదు క్లస్టర్లుగా విభజించి మొదటి సమావేశాన్ని ఏలూరులో ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టింది. ఈ భేటీని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించనుండడం మరో విశేషం. ఎన్నికల నిర్వహణ గురించి బూత్ ఏజెంట్లకు రాజ్నాథ్ వివరిస్తారు.