అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్ లోని జామ్నగర్ లో ఇటీవల ఘనంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఆ వేడుకల్లో చోరీ చేసేందుకు తమిళనాడుకు చెందిన ఓ ముఠా యత్నించినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది.

కట్టుదిట్టమైన భద్రత కారణంగా ఆ ఈవెంట్ కు వెళ్లలేకపోవడంతో జామ్నగర్ లోని కొన్ని కార్ల అద్దాలు బద్దలుగొట్టి దొంగతనాలు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా మొత్తం ఆరుగురిని అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు.