ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో రెండో రోజు BRS ఎమ్మెల్సీ కవిత విచారణ ప్రారంభమైంది. రూ.100 కోట్ల ముడుపుల వ్యవహారం, ఇతర నిందితుల వాంగ్మూలాలపై ఆమెను అధికారులు ప్రశ్నిస్తున్నారు.
అటు ఇవాళి విచారణకు తాము హాజరుకావడం లేదని ఇటీవల నోటీసులు అందుకున్న కవిత భర్త అనిల్, వ్యక్తిగత సిబ్బంది ఈడీకి బదులిచ్చారు. ఇక కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగనుంది.