తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు ఐఎండీ తెలిపింది. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాబోయే 2 రోజుల్లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

అలాగే తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.