యాసంగి ధాన్యం కొనుగోళ్లను ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 7వేలకు పైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తోందట.
ఈ సీజన్లో 60-70 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం వరి మద్దతు ధర గ్రేడ్ ‘ఏ’ రకానికి ₹2,203, సాధారణ రకానికి ₹2,183గా ఉంది. కాగా ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వరి కోతలు మొదలయ్యాయి.