టీ20 వరల్డ్ కప్ 2024 ట్రోఫీని ఐసీసీ ఆవిష్కరించింది. న్యూయార్క్ లోని అంపైర్ స్టేట్ బిల్డింగ్పై విండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్, USA బౌలర్ అలీ ఖాన్ కలిసి ట్రోఫీని ఆవిష్కరించారు.
ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా జూన్ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్ లో టీ20 WC జరగనుంది. మొత్తం 20 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. జూన్ 6న ఐర్లాండ్ తో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది.