కొత్వాల చొరవతో రహదారి పునరుద్ధరణ
పాల్వంచ ఫారెస్ట్ ఆఫీస్ రోడ్డుకు ఇరువైపులా రహదారిపై పెట్టిన బ్యారికేడ్లను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అధికారులను కోరారు.
ఈ మేరకు కొత్వాల తోపాటు కాంగ్రెస్ నాయకులు శనివారం మునిసిపల్ కమీషనర్ A స్వామిని, ఫారెస్ట్ FDO దామోదర్ రెడ్డిని కలిసి బ్యారికేడ్లను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు ఆ రహదారిపై రాకపోకలు సాగిస్తున్నారని, రహదారిని మూసివేయడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురి అవుతున్నారన్నారు. వెంటనే రహదారి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలనీ కొత్వాల కోరారు.
కొత్వాల చొరవతో సమసిన రహదారి వివాదం
రహదారి సౌకర్యాన్ని పునరుద్దరించాలనే కొత్వాల చొరవతో, మున్సిపల్, అటవీ శాఖాధికారులతో సమన్వయంగా చర్చించి, రాకపోకలను పునరుద్ధరణకు చర్యలు చేపట్టడంతో వివాదం ముగిసింది.
కొత్వాలకు అభినందనలు అధికారులను సమన్వయ పరిచి రహదారి సౌకర్యాన్ని కలిగించేలా కృషి చేసిన కొత్వాలను ప్రజలు, పలువురు అభినందించారు.
ఈ కార్యక్రమంలో పాల్వంచ మాజీ ZPTC యర్రంశెట్టి ముత్తయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోండం వెంకన్న, LDM కో-ఆర్డినేటర్ బద్ది కిషోర్, శిరసాని రమణ, SK చాంద్ పాషా, H మధు, SK నజీర్, మస్తాన్, బాబునాయక్ తదితరులు పాల్గొన్నారు.