తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో ఈనెల 3వ తేదీన నిర్వహించే రైతు సదస్సులలో భాగంగా జరిగే జగన్నాధపురం రైతు వేదికను శుక్రవారం DCMS వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు సందర్శించారు. రెవిన్యూ, వ్యవసాయ శాఖ, మండల పరిషత్ అధికారులతో కలిసి సన్నాహక ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ…
శనివారం పాల్వంచ మండలం పరిధిలోని జగన్నాధపురం, పాండురంగాపురం, పుల్లాయి గూడెం, ఉలవనూరు బంజర రైతు వేదికల వద్ద సదస్సులు నిర్వహిస్తారన్నారు. రైతు వేదికల వద్ద ఎండ తీవ్రత దృష్టిలో ఉంచుకుని మంచినీటి సౌకర్యం, భోజన వసతులు, కల్పించనున్నారన్నారు. ఇప్పటికే వేదికలను మామిడి తోరణాలతో, రంగురంగుల బల్బులతో విద్యుద్దీకరించారన్నారు.
జగన్నాధపురం రైతు వేదికలో రైతు ఉత్సవాన్ని ప్రారంభించనున్న… – ఎం.ఎల్.ఏ. వనమా
శనివారం రైతు వేదికలో జరిగే సదస్సులను కొత్తగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు గారు జగన్నాధపురం లో ఉదయం 9:30 గంటలకు ప్రారంభిస్తారని, రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కొత్వాల అన్నారు.
ఈ కార్యక్రమంలో MRO రంగప్రసాద్, MDO అప్పారావు, MPO నారాయణ,వ్యవసాయ శాఖ అధికారి శంభో శంకర్, సహకార సీనియర్ ఇన్స్పెక్టర్ కె. ఆదినారాయణ, సొసైటీ డైరెక్టర్లు చౌగాని పాపారావు, భూక్య కిషన్, AAO సత్యం,సొసైటీ CEO లక్ష్మీనారాయణ, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.