రాష్ట్రంలో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం 30 లక్షల టన్నులు దాటింది. 4.94 లక్షల మంది రైతులు వడ్లను విక్రయించారు.

7,166 కొనుగోలు కేంద్రాల్లో మే 13వ తేదీ నాటికి రూ. 6,642.43 కోట్ల విలువైన 30.29 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో కొనుగోళ్లు దాదాపుగా పూర్తికావచ్చాయి.