ప్రఖ్యాత యాదాద్రి క్షేత్రంలోని ప్రధానాలయంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు ఈ నెల 20న మొదలవుతాయి. మూడు రోజులపాటు కొనసాగే ఈ ఉత్సవాలకు విశ్వక్సేన ఆరాధనతో శ్రీకారం చుడతారు.
వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఈవో భాస్కర్రావు తెలిపారు. పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలోనూ శ్రీస్వామి జయంతి ఉత్సవాలకు ఈ నెల 20 నుంచి 22 వరకు నిర్వహిస్తామని ఈవో పేర్కొన్నారు.