కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా తెలుగు మహిళ జయ బాడిగ నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పదవికి ఎంపికైన తొలి మహిళగా ఈమె గుర్తింపు పొందారు.

2022నుంచి కోర్టు కమిషనర్ గా పనిచేస్తున్న జయ ఫ్యామిలీ లా నిపుణురాలిగా పేరొందారు. ఈ రంగంలో ఎందరికో మార్గదర్శకురాలి గానూ వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో పుట్టిన జయ బాడిగ హైదరాబాదులో ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్నారు.