రాష్ట్రంలోని నరసరావుపేట, గురజాల, తిరుపతి, తాడిపత్రి సబ్డివిజన్లకు కొత్త డీఎస్పీలను ఎన్నికల సంఘం నియమించింది. వీరితోపాటు మరికొన్ని స్థానాల్లోనూ నియామకాలు చేపట్టింది.
పోలింగ్ రోజన, ఆ తర్వాత చెలరేగిన హింసాకాండకు బాధ్యుల్ని చేస్తూ ఎన్నికల సంఘం మొత్తం 12మంది డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. వారిస్థానంలో ఈ కొత్త అధికారులను నియమించింది. వెంటనే బాధ్యతలు చేపట్టాలని ఆదేశించింది.