ఆదాయ పన్ను కనిష్ఠ స్లాబ్ రేట్ పరిధిలోని వారికి బడ్జెట్లో ఊరట లభించే అవకాశం ఉందని CII కొత్త చీఫ్ సంజీవ్ పురీ తెలిపారు.

ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కేంద్రం ఈ అంశాన్ని పరిశీలించొచ్చని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సంస్కరణలు చేపట్టేలా ఓ ప్రత్యేక ప్లాట్ఫామ్ ఉండాలన్నారు. కాగా ఆదాయపన్ను తగ్గిస్తే వినియోగం పెరిగి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.