తెలంగాణ సర్కార్ మహిళలను సంపన్నులను చేసేందుకు సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుడుతోంది. మహిళా శక్తిలో భాగంగా మీసేవ, ఆధార్ కేంద్రాలు ఇవ్వాలని యోచిస్తోంది.
రాష్ట్రంలో దాదాపు 1,050 మీసేవ కేంద్రాలు, ఆధార్ కేంద్రాల అవసరం ఉందని ప్రభుత్వానికి అధికారులు రిపోర్ట్ ఇచ్చారు. వీటిని మహిళలకు ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించినట్టు సమాచారం.