Month: August 2024

సెప్టెంబరు 21న గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితా తుది జాబితా – ఎస్‌.ఇ.సి. పార్థసారథి

గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారీలో జిల్లా అధికార యంత్రాంగం నిమగ్నం కావాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్‌ఇసి) పార్థసారథి ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, జిల్లా, డివిజన్ పంచాయతీ అధికారులు, ఇఆర్‌ఇలతో గురువారం ఎస్‌ఇసి పార్థసారథి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.…

బిగ్ బాస్ 8 కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ లిస్ట్

బిగ్ బాస్ 8 మొదలు కావడానికి మరో రెండు రోజులు మాత్రమే సమయముంది. ఆదివారం సాయంత్రం 7 గంటలకు మొదలు కాబోయే గ్రాండ్ ఓపెనింగ్ ఎపిసోడ్ ని శనివారం నుంచే షూట్ చెయ్యడం మొదలు పెడతారు. నాగార్జున హోస్ట్ గా మొదలు…

TG : రుణమాఫీపై ఫీల్డ్ సర్వే మొదలు

రాష్ట్రంలో రుణమాఫీపై ఫీల్డ్ సర్వే ప్రారంభమైంది. ఇందులో పలు సమస్యలతో రుణమాఫీ నిలిచిపోయిన రైతుల ఇళ్లకు వ్యవసాయ శాఖ అధికారులు వెళ్లి కుటుంబ సభ్యుల నిర్ధరణను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 4.24 లక్షల అకౌంట్లను 4 రోజుల్లో పూర్తి…

TG : బుద్ధ వనంలో బౌద్ధ విశ్వవిద్యాలయం!

నాగార్జునసాగర్ సమీపంలోని బుద్ధ వనంలో బౌద్ధ విశ్వవిద్యాలయం స్థాపన కోసం మలేషియా బుద్ధిస్సంస్థ ముందుకు వచ్చింది. 274ఎకరాల మేర విస్తరించి ఉన్న బుద్ధవనం ప్రాజెక్టులో తమకు అవసరమైన స్థలాన్ని కేటాయించిన పక్షంలో అంతర్జాతీయ ప్రమాణాలతో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు…

ఈగలను అంతరిక్షంలోకి పంపనున్న ఇస్రో

గగన్యాన్ ప్రయోగానికి సంబంధించి ఇస్రో మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2025లో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా నలుగురు వ్యోమగాములతో పాటు 20ఈగలను అంతరిక్షంలోకి పంపించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా డ్రోసోఫిలియా మెలనోగాస్కర్ (ఫ్రూట్ ఫ్లై) జాతికి చెందిన 10ఆడ, 10మగ…

Telangana : డిసెంబర్ 15,16 తేదీలలో గ్రూప్ 2 పరీక్షలు… తాజాగా షెడ్యూల్‌ విడుదల…

రాష్ట్రంలో గ్రూప్ 2 పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదలైంది. డిసెంబర్ 15,16 తేదీలలో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. ఈ పరీక్షలకు మొత్తం నాలుగు పేపర్లు రాయాల్సి ఉండగా.. ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్షలు…

భారత్, మలేషియా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం

భారత్, మలేషియా మధ్య సంబంధాలను మరింత మెరుగుపర్చుకొనే దిశగా మరో ముందడుగు పడింది. ఇరుదేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఢిల్లీలో విస్తృత స్థాయి చర్చలు నిర్వహించారు. వ్యాపారం, వాణిజ్యం,…

AP : 27, 28న తిరుమలలో ఆర్జిత సేవలు రద్దు

ఈనెల 27న శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానాన్ని నిర్వహించనున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి ముఖ మండపంలో బంగారు సర్వభూపాల వాహనంపై కృష్ణస్వామివారిని వేంచేపు చేసి నివేదనలు సమర్పిస్తామన్నారు. ఈనెల 28న ఉట్లోత్సవం…

పుణెలో భారీ అగ్నిప్రమాదం

పుణెలోని పింప్రి చింద్వాడ్ లోని దేహు రోడ్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం…

అలస్కా ఎయిర్ లైన్స్ కు ఊరట

హవాయి ఎయిర్ లైన్స్ ను 1.9 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేయాలనే అలస్కా ఎయిర్ ప్రతిపాదనను సవాలు చేయకూడదని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ నిర్ణయించడంతో.. ఇరు సంస్థల విలీనానికి అడ్డంకి తొలగిపోయింది. ఇది అలస్కా ఎయిర్ లైన్స్ కు ఊరట…

5 ఏళ్లలో 17,500 కి.మీ సీసీ రోడ్లు వేస్తాం: సీఎం

పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖలో తీసుకుంటున్న సంస్కరణలను సీఎంకు వివరించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. అనంతరం సీఎం మాట్లాడుతూ.. పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.990కోట్లు, జల్ జీవన్ మిషన్…

ఉక్రెయిన్ ఆధీనంలోకి రష్యా గ్రామాలు

రష్యాలోని కస్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ బలగాలు పట్టు పెంచుతున్నాయి. తాజాగా 92 రష్యా గ్రామాలు ఉక్రెయిన్ ఆధీనంలోకి తీసుకుంది. 1250 చదరపు కిలోమీటర్ల రష్యా భూభాగం తమ నియంత్రణలో ఉన్నట్లు జెలెన్స్కీ ప్రకటించారు. మరోవైపు కస్తో పాటు ఫ్రంట్ లైన్లో చాలా…

జియో టీవీ ప్లస్.. ఒక కనెక్షన్ తో రెండు టీవీలు!

రిలయన్స్ జియో స్మార్ట్ టీవీల కోసం ‘జియో టీవీ ప్లస్ యాప్’ను తీసుకువస్తున్నట్లు.. 2 ఇన్ వన్ ఆఫర్ కూడా ప్రకటించింది. దీంతో వినియోగదారు ఒకే జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్ తో రెండు టీవీలను కనెక్ట్ చేసుకోవచ్చు. జియో టీవీ…

సీనియర్ సిటిజన్లవే 47% FDలు..!

సీనియర్ సిటిజన్లతో పోలిస్తే యువత పెట్టుబడులపై భిన్నంగా ఆలోచిస్తోందని SBI రీసెర్చ్ తెలిపింది. FDల్లో 47% వృద్ధులవేనని పేర్కొంది. మ్యూచువల్ ఫండ్లు, ఈక్విటీకే యువత మొగ్గు చూపుతోందని వెల్లడించింది. క్యాపిటల్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల సగటు వయసు 32 ఏళ్లకు తగ్గిందని, అందులో…

AP : టీటీడీలో దాతలకు గదుల కేటాయింపు రద్దు

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా దాతలకు గదుల కేటాయింపును టీటీడీ రద్దు చేసింది. అక్టోబరు 4 నుంచి 12 వరకు భక్తుల సౌకర్యార్థం టీటీడీలోని వివిధ ట్రస్టులకు, పథకాలకు విరాళాలు అందించిన దాతలకు గదుల కేటాయింపు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.…

జమ్ముకశ్మీర్ లో ఉగ్రదాడి.. భద్రతా బలగాలు అప్రమత్తం

జమ్ముకశ్మీర్ లోని ఉధంపూర్ లో తాజాగా జరిగిన ఉగ్రదాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ఇన్స్పెక్టర్ ఒకరు వీరమరణం చెందారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం CRPF బలగాలతో పాటు జమ్ముకశ్మీర్ పోలీసులు డూడు ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, ఉగ్రవాదులు…

పవన్ సరసన అవకాశం రావడం నా అదృష్టం: ప్రియాంక

పవన్ కల్యాణ్ హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఓజీ’. ఇందులో పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ కనిపించనున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రియాంక అరుల్ మోహన్ ‘ఓజీ’ అవకాశం రావడం గురించి మాట్లాడారు. “ఓజీ లాంటి గొప్ప కథలో…

జమ్మూకశ్మీర్ లో భావసారూప్య పార్టీలతో కూటమికి కాంగ్రెస్ సై

రానున్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో తమతో కలిసి పోటీ చేసేందుకు నేషనల్ కాన్ఫరెన్స్ (NC), పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (PDP)సంసిద్ధత వ్యక్తం చేశాయని జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు తారిక్ హమీద్ కర్రా వెల్లడించారు. NC ఇప్పటికే కేంద్ర నాయకత్వంతో ఈ…

TG : RTCలో రికార్డు ప్రయాణాలు

రాఖీ పౌర్ణమి రోజున TGSRTCలో రికార్డు స్థాయిలో ప్రయాణాలు నమోదయ్యాయి. ఆర్టీసీ బస్సుల్లో నిన్న ఒక్కరోజే 63.86 లక్షలమంది రాకపోకలు సాగించారు. 41.74 లక్షలమంది మహిళలు మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని వినియోగించుకున్నారు. మహిళలకు మొత్తం 17కోట్ల రూపాయలు ఆదా…

తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న అసెంబ్లీ స్థానాలు!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో శాసనసభ స్థానాల పెంపు 2026లోనేనని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 (3) ప్రకారం 2026లో జనాభా లెక్కల అనంతరం ఆంధ్రప్రదేశ్లో 175 నుంచి 225 శాసనసభ స్థానాలకు, తెలంగాణలో 119 నుంచి 153…

అమెరికాలో మళ్లీ కరోనా కలవరం!

కొవిడ్ కొత్త వేరియెంట్ ‘కేపీ.2’ అమెరికాను వణికిస్తుంది. ప్రతి 10 లక్షల మందికి ఒకటి నుంచి నాలుగుకు పెరిగింది. శాంపిల్స్ లో 100% ‘సార్స్-కోవ్-2’ను గుర్తించామని వేస్ట్వాటర్ స్కాన్ ప్రోగామ్ డైరెక్టర్ మార్లినె తెలిపారు. స్కూళ్ల సెలవులు ముగిశాక, కేసుల సంఖ్య…

ఒడిశాలో పిడుగుపాటుకు 15 మంది మృతి

ఒడిశాలో పిడుగుపాటుకు 15 మంది మృతి చెందారు. రెండు రోజుల వ్యవధిలో శనివారం 9 మంది, ఆదివారం ఆరుగురు చనిపోయారని, పలువురు గాయాలపాలయ్యారని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలపై సీఎం మోహర్ చరణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4…

ఐదేళ్లలో రూ.1.7 లక్షల కోట్ల పెట్టుబడులు: BPCL

రాబోయే ఐదేళ్లలో రూ.1.7 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL) ప్రణాళికలు రూపొందించింది. ప్రధానమైన చమురు రిఫైనింగ్, పెట్రోలియం ఉత్పత్తుల మార్కెటింగ్ వ్యాపారాన్ని వృద్ధి చేసేందుకు, భవిష్యత్తుకు కీలకమైన హరిత ఇంధనాల…

TG : హైదరాబాద్ లో నిలిచిన 25 గృహ ప్రాజెక్టులు

హైదరాబాద్ లో 25 హౌసింగ్ ప్రాజెక్టుల (6,169ఫ్లాట్లు/ఇళ్లు) పనులు మధ్యలో నిలిచిపోయాయని డేటా అనలిటిక్ సంస్థ ప్రాప్తోక్విటీ తెలిపింది. దేశంలోని 42 నగరాల్లో ఇలాంటివి 1,981 గృహ ప్రాజెక్టులు(5.08లక్షల ఇళ్లు/ ఫ్లాట్లు) ఇలానే ఆగిపోయాయని వెల్లడించింది. డెవలపర్ల ఆర్థిక నిర్వహణ సరిగా…

పక్షవాత ప్రమాదాన్ని ముందే హెచ్చరించే రక్తపరీక్ష

పక్షవాతం వచ్చే ప్రమాదాన్ని ముందే పసిగట్టే రక్తపరీక్షను స్వీడన్లో ఉప్సాల విశ్వవిద్యాలయ పరిశోధకులు ఆవిష్కరించారు. ఎవరి రక్తంలో ఇది ఎక్కువగా ఉంటుందో వారికి పక్షవాతం వచ్చే ప్రమాదం చాలా ఎక్కువని 3,000 మందిపై జరిగిన అధ్యయనంలో తేలింది. గుండె లయతప్పి వేగంగా…

AP : విజయవాడ నుంచి ఢిల్లీకి కొత్త విమాన సర్వీసు

విజయవాడ నుంచి ఢిల్లీకి కొత్తగా మరో విమాన సర్వీసు అందుబాటులోకి రానుంది. ఈ సేవలు సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం సమయంలో ఢిల్లీకి విమాన సర్వీసు అందుబాటులోకి తేవాలని ప్రజల నుంచి డిమాండ్ రావడంతో కొత్త సర్వీసు నడిపేందుకు…

TG : రూ.17,933 కోట్ల రుణమాఫీ

రాష్ట్రంలో రూ.2 లక్షల లోపు రుణమాఫీ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా 22,37,848 మంది రైతుల ఖాతాల్లో రూ.17,933 కోట్లు జమ చేసింది. మొదటి విడత 11,50,193 మందికి సంబంధించి రూ. 6,098.93 , రూ. 6,40,823 మందికి సంబంధించి రూ.6,190.01…

HYD : ఫార్మసీ కౌన్సెలింగ్ కు షెడ్యూల్ ఎప్పుడో…?

బీఫార్మసీ కౌన్సెలింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఫలితంగా వేలాది మంది MPC, BIPC విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కన్వీనర్ కోటా కింద బీఫార్మసీ సీట్లు సుమారు 10,500 ఉన్నాయి. గత ఏడాది బైపీసీ విద్యార్థులకు సెప్టెంబరు…

HYD : AP విద్యార్థులకు డిగ్రీ, పీజీ ప్రవేశాల్లేవ్

అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం తాజాగా AP విద్యార్థులకు ప్రవేశాలు నిలిపివేస్తూ పూర్తిస్థాయి నోటిఫికేషన్ జారీ చేసింది. డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరే తెలంగాణ విద్యార్థులు ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. AP ప్రభుత్వం అభ్యర్థిస్తే నోటిఫికేషన్ లో మార్పులు…

బెంగాల్ ప్రభుత్వంపై మండిపడ్డ హైకోర్టు

పశ్చిమ బెంగాల్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈనేపథ్యంతో ఆ ఘటన జరిగిన ఆర్జేకర్ ఆసుపత్రిలో బుధవారం అర్ధరాత్రి దుండగులు విధ్వంసానికి పాల్పడ్డారు. దీనిపై కలకత్తా హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం వల్లే ఈ దాడి జరిగిందని,…

స్వీడన్ లో తొలి మంకీపాక్స్ కేసు నమోదు

ఆఫ్రికా సహా పలు దేశాల్లో మంకీపాక్స్ కలవరపెడుతోంది. ఈ వైరసు అంతర్జాతీయ అత్యవసర స్థితిగా WHO ప్రకటించిన మరుసటి రోజే స్వీడన్లో తాజాగా తొలి కేసు నమోదైంది. రాజధాని స్టాక్హోమ్ కు చెందిన ఓ వ్యక్తికి ఎంపాక్స్ నిర్ధారణ అయ్యింది. క్లేడ్…

బ్యాంకు ఖాతా లేకున్నా యూపీఐ పేమెంట్స్

యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్ పై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ మరో కొత్త ఫీచర్ పరిచయం చేసింది. బ్యాంక్ ఖాతా లేకున్నా ఒకరి యూపీఐ అకౌంట్ను వేరొకరు వాడుకునేలా యూపీఐ సర్కిల్ పేరిట కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. ప్రస్తుతం బ్యాంక్…

బంగ్లాదేశకు అమెరికా కీలక సూచన…

బంగ్లాదేశ్ లో విధ్వంసానికి ముగింపు పలకాలని అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ అభిప్రాయపడ్డారు. దీని కోసం భారత్ సహా వివిధ దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. అయితే తాము ప్రైవేటు దౌత్య చర్చల జోలికి మాత్రం వెళ్లడం లేదని…

వర్షాకాలంలో రోగ నిరోధక శక్తి పెంచే కూరగాయలు

వర్షాకాలంలో వాతావరణ పరిస్ధితులు మారడంతో జీర్ణ సమస్యలు, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఈక్రమంలో పోషక విలువలతో కూడిన కూరగాయలను తీసుకోవడం ద్వారా వర్షాకాలంలో తలెత్తే అనారోగ్యాల ముప్పును నివారించవచ్చు. కాకరకాయ, సొరకాయ, బీరకాయ, పాలకూర, మెంతికూర, మునగ,…

77 ఏళ్ల స్వాతంత్య్రం… 77 మంది మహిళా పైలెట్లు… ఇండిగోలోకి…

దేశానికి స్వాతంత్య్రం లభించి 77 ఏళ్లు పూర్తయిను సందర్భాన్ని పురస్కరించుకుని 77 మంది మహిళా పైలెట్లను చేర్చుకున్నట్లు ఇండిగో వెల్లడించింది. దీంతో సంస్థలో మొత్తం మహిళా పైలెట్ల సంఖ్య 800 మించింది. కొత్తగా చేర్చుకున్న 77 మందిలో 72 మంది ఎయిర్బస్…

జూనియర్ NTR… ఇక Mr. NTR…

ఎన్టీఆర్ తన ట్యాగ్ లైన్ ను మార్చుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఆయన అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ అని సంబోధించేవారు. కానీ, ఆయన టీమ్ అఫీషియల్ స్టేట్మెంట్లో Mr.NTR అని పేర్కొంది. 40+ ఏళ్లు దాటినప్పటికీ ఇంకా జూనియర్ ట్యాగ్ లైన్ ఎందుకని,…

నల్ల మిరియాలతో ఈ సమస్యలు దూరం!

వర్షాకాలంలో నల్ల మిరియాలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. నల్ల మిరియాలు అజీర్ణం, ఉబ్బరం, కడుపులో అసౌకర్యం, జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి. ఇది సహజ యాంటీ బయాటిక్గా పనిచేస్తుంది. హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలని నివారిస్తుంది. వర్షాకాలంలో వచ్చే జలుబు, జ్వరం నుంచి…

యమునా నదిపై 32 మానిటరింగ్ స్టేషన్లు

ఢిల్లీలోని యమునా నదిలో కలిసే ప్రధాన కాలువలపై 32 మానిటరింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. కాలుష్య స్థాయిని పర్యవేక్షించడం, యమునా ప్రక్షాళన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడం వీటి లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. ఈ స్టేషన్ల ద్వారా కాలువలలోకి ప్రవహించే మురికి నీటి…

దారుణం: మహిళను బైక్ కు కట్టేసి

రాజస్థాన్ లో దారుణం చోటు చేసుకుంది. నగౌర్ జిల్లాలో ఓ వ్యక్తి మద్యం మత్తులో భార్యను బైక్కు కట్టేసి ఊరంతా లాక్కెళ్లాడు. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. బైక్కు భార్యను కట్టడానికి ముందు…

ఢిల్లీ మెట్రో కీలక ప్రకటన

స్వాతంత్య్ర దినోత్సవానికి దేశం సిద్ధమవుతున్న తరుణాన… ఢిల్లీ మెట్రో కీలక ప్రకటన చేసింది. మెట్రో సేవల్లో మార్పులు జరిగినట్లు ప్రకటించింది. ఆగస్టు 15 ఉదయం 4 గంటలకే సర్వీసులు ప్రారంభమవుతాయని ఢిల్లీ మెట్రో వెల్లడించింది. స్వాతంత్య్ర సంబరాలకు హాజరయ్యే ప్రజల సౌలభ్యం…

ఆ సినిమా పదే పదే చూశాను: విజయ్ సేతుపతి

తాను కష్టాల్లో ఉన్నప్పుడు మహేశ్ బాబు నటించిన ‘అతడు’ రిపీట్ మోడ్లో చూశానని విజయ్ సేతుపతి తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..‘నేను కష్టాల్లో ఉన్నప్పుడు మహేశ్ బాబు నటించిన ‘అతడు’ పదేపదే చూశాను. అందులో ప్రతి సన్నివేశం నాకు గుర్తే.…

అణువిద్యుత్తు కేంద్రంలో భారీగా మంటలు

ఐరోపాలో అతిపెద్ద అణువిద్యుత్తు కేంద్రాల్లో ఒకటైన జపోరిజియాలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ప్రస్తుతం ఈ ప్లాంట్ నియంత్రణ రష్యా అధీనంలో ఉంది. ఈ ప్లాంట్ లో మాస్కో దళాలే పేలుళ్లకు పాల్పడ్డాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. వారు కీవ్ను బ్లాక్…

ఏనుగులు… దేశ చరిత్రలో భాగం: మోదీ

దేశంలో ఏనుగులు వృద్ధి చెందడానికి అనుకూలమైన ఆవాసాలను ఏర్పాటు చేయడానికి నిబద్ధతతో ప్రయత్నిస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. దేశ సంస్కృతి, చరిత్రలో ఏనుగులు భాగంగా ఉన్నాయన్నారు. ఇవాళ వరల్డ్ ఎలిఫెంట్ డే సందర్భంగా వాటి రక్షణకు కృషి చేస్తున్న సంస్థలు, వ్యక్తులను…

ఫోన్ పే, గూగుల్ పే కు భీమ్ చెక్!

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI).. తన భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ(BHIM) యాప్ ను స్వతంత్ర అనుబంధసంస్థగా మార్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భీమ్ ఉనికిని విస్తరించడానికి సన్నద్ధమవుతోంది. దీనికోసం లలితా నటరాజ్ ను భీమ్ సీఈవోగా…

ఉప రాష్ట్రపతి రాకకు భారీగా ఏర్పాట్లు

తెలంగాణలో ఈ నెల 16న ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ పర్యటించనున్నారు. హైదరాబాద్ లో ఆయన బస చేసేందుకు సీఎస్ శాంతి కుమారి ఏర్పాట్లను సమీక్షించారు. ఎలాంటి ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అధికారులను సీఎస్ ఆదేశించారు.…

AP : తిరుమలలో బైకుల రాకపోకలపై ఆంక్షలు

శ్రీవారి భక్తుల భద్రత దృష్ట్యా తిరుమలకు బైకుల రాకపోకలపై ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఆంక్షలు విధిస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటలవరకు మాత్రమే రెండు ఘాట్రోడ్లలో బైకులను అనుమతించనుంది. ఆగస్టు, సెప్టెంబర్…

యూకే టెలికాం కంపెనీలో సునీల్ మిత్తల్ కంపెనీకి వాటా

యూకేకు చెందిన ప్రముఖ టెలికాం కంపెనీ బ్రిటిష్ టెలికాం గ్రూప్లో సునీల్ మిత్తల్ నేతృత్వంలోని భారతీ గ్లోబల్ సంస్థ వాటాలు కొనుగోలు చేయనుంది. ఆల్టిస్ యూకే నుంచి 24.4 వాటా కొనుగోలు చేయనునున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఎయిర్టెల్ భారతీ ఎంటర్ప్రైజెస్కు చెందిన…

లంబోర్గిని ఉరుస్ హైబ్రిడ్ వెర్షన్

ఇటలీ సూపర్ కార్ల తయారీ సంస్థ లంబోర్గిని, SUV మోడల్ ఉరుస్లో ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వెర్షన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.4.57కోట్లు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఉరుస్ ఎస్ఈ మోడల్లో అమర్చిన ట్విన్ టర్బో 4.0 V8…

TG : ఈ నెల 12 నుంచి CPGET కౌన్సెలింగ్

ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. 21 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ 27 నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్లకు ఛాన్స్ ఇచ్చారు. SEP 4న మొదటి ఫేజ్ సీట్లను అలాట్ చేయగా…

HYD : ఆగస్టు 20 నుంచి ఓటరు జాబితా సవరణ

ఓటరు జాబితా సవరణ షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికలసంఘం ప్రకటించింది. ఈనెల 20వ తేదీ నుంచి ఓటరు జాబితా సవరణ ప్రారంభమై జనవరి 6న తుది జాబితా ప్రకటనతో ముగియనుంది. ఆగస్టు 20నుంచి అక్టోబరు 18వ తేదీ వరకు ఓటరు జాబితా…

UKలో తగ్గుతున్న భారతీయ విద్యార్థులు.. ఎందుకంటే?

కఠినతరమైన వీసా నిబంధనలు, వలసదారులపై ఆందోళనల కారణంగా బ్రిటన్ విశ్వవిద్యాలయాల్లో భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నది. హయ్యర్ ఎడ్యుకేషన్ స్టాటిస్టిక్స్ ఏజెన్సీ(HESA) విడుదల చేసిన డాటా ప్రకారం నిపుణులైన ఉద్యోగులు, విద్యార్థులు వీసాల కోసం చేసే దరఖాస్తుల సంఖ్య తగ్గిందని…

కరోనాపై WHO ఆందోళన

కొవిడ్-19పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా పాజిటివ్ కేసుల శాతం పెరుగుతోందని తెలిపింది. కరోనా వైరస్ మరో వేరియంట్ గా మారే అవకాశాలు ఉన్నాయని హెచ్చిరించింది. 84 దేశాల్లో నిర్వహించిన తమ సెంటినెల్ ఆధారిత…

రష్యా : అమెరికా మహిళా జర్నలిస్టుకు ఎనిమిదేళ్ల జైలుశిక్ష

అమెరికా జర్నలిస్టు, రచయిత్రి మాషా గెసెస్కు మాస్కో కోర్టు ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించింది. రష్యన్ సైన్యం గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసిన కేసులో గెసెస్ను న్యాయస్థానం దోషిగా తేల్చింది. మాస్కోలో జన్మించిన గెసిన్ ప్రస్తుతం అమెరికాలో నివాసం ఉంటున్నారు.…

‘ X ‘ లో అత్యధిక ఫాలోవర్స్ వీరికే…!

ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఎక్స్లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన అకౌంట్ హోల్డర్లు ఎవరో చూద్దాం. ◼️ఎలన్ మాస్క్: 189.7 మిలియన్ ఫాలోవర్స్ ◼️బరాక్ ఒబామా: 131.7 మిలియన్ ◼️క్రిస్టియానో రొనాల్డో: 112 మిలియన్ ◼️జస్టిన్ బీబర్: 110.5 మిలియన్ ◼️రెహానా:…

ఫ్రాడ్ అకౌంట్స్ నిబంధనల్లో మార్పులు చేసిన RBI

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్రాడ్ రిస్క్ మేనేజ్మెంట్ పై తమ మాస్టర్ డైరెక్షన్ ను సవరించింది. ఏదైనా ఖాతాను మోసంగా ప్రకటించే ముందు సదరు ఖాతాదారుడు లేదా రుణగ్రహీత చేప్పేది బ్యాంకులు వినాలన్న సుప్రీంకోర్టు తీర్పు సిఫార్సు మేరకే ఈ…

HYD : వచ్చే ఏడాది నుంచి ‘ఇంజినీరింగ్’కు కొత్త ఫీజులు

రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి ఇంజినీరింగ్ తో పాటు ఫార్మసీ, మేనేజ్మెంట్ తదితర ఉన్నత విద్యా కోర్సులకు కొత్త ఫీజులు అమల్లోకి రానున్నాయి. మూడేళ్లకు ఒకసారి తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (TAFRC) రుసుములను సమీక్షించి కొత్తవాటిని ఖరారు చేస్తుంది.…

AP : ఎస్సీ, ఎస్టీ డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబనకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఈ పథకం కింద వారికిచ్చే సున్నా వడ్డీ రుణాల పరిమితిని రూ.2లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచింది. ఆయా వర్గాలకు చెందిన మహిళల…

త్వరలోనే ‘యాంటీ-నార్కోటిక్స్’ జాతీయ హెల్ప్ లైన్ నంబర్!

మాదకద్రవ్యాల సంబంధిత ఫిర్యాదులకు మార్గం సుగమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా త్వరలోనే జాతీయ స్థాయిలో యాంటీ-నార్కోటిక్స్ హెల్ప్ లైన్ నంబర్ ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ‘1933’ నంబర్ తో పాటు ఈమెయిల్ను అందుబాటులోకి తెచ్చేందుకు అధికార…

భార్యకు బాల్యస్నేహితుడితో పెళ్లి జరిపించిన భర్త

బీహార్ లో ఓ భర్త ఎవరూ చేయని రీతిలో భార్యకు ఆమె బాల్యస్నేహితుడితో పెళ్లి జరిపించాడు. భార్య ప్రేమను గెలిపించడానికి తన దాంపత్య జీవితాన్ని త్యాగం చేశాడు. కోరుకున్న వ్యక్తితో హాయిగా జీవించు అంటూ భార్యను దీవించి పంపాడు. బీహార్లోని లక్షిసరాయ్…

పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత: యునెస్కో

బాల్యంలోని ఆరంభ దశలో అందించే విద్య పిల్లల జీవితకాల అభివృద్ధిని నిర్దేశిస్తుందని, అయితే.. ప్రపంచవ్యాప్తంగా 194 దేశాల్లో 46 దేశాలు మాత్రమే ప్రీప్రైమరీ విద్యను ఉచితంగా అందిస్తున్నాయని యునెస్కో తెలిపింది. మరోవైపు ప్రీప్రైమరీ పాఠశాలల్లో 57 శాతం మంది మాత్రమే సుశిక్షితులైన…

‘ఆసియాలోనే అతిపెద్ద’ హైపర్ లూప్ ట్యూబ్

హైపర్ లూప్ టెక్నాలజీతో రవాణా రంగంలో మరో సరికొత్త విప్లవం ఆవిష్కృతం కానుంది. ఈ అత్యాధునిక సాంకేతికతను వినియోగించి మద్రాస్ ఐఐటీ.. తైయూర్ క్యాంపస్లో 425 మీటర్ల పొడవైన హైపర్లూప్ ట్యూబ్ ను నిర్మించింది. ఈ ప్రాంగణం వేదికగా వచ్చే ఏడాది…

భారత్ పై వరల్డ్ బ్యాంకు సంచలన వ్యాఖ్యలు

అమెరికన్ ల వ్యక్తిగత తలసరి ఆదాయంలో నాలుగో వంతు స్థాయికి చేరుకోవడానికి భారత్ కు మరో 75 ఏళ్లు పడుతుందని ప్రపంచబ్యాంక్ సంచలన వ్యాఖ్యలు చేసింది. భారత్ ఆర్థిక వృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్, చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికాతో పాటు…

వర్షాకాలంలో కామెర్ల వ్యాధితో జాగ్రత్త

వర్షాకాలంలో కామెర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచాలంటే అల్లం కచ్చితంగా తీసుకోవాలి. బ్లాక్ టీలో కొద్దిగా అల్లం కలిపి రోజూ తాగవచ్చు. చట్నీ, పప్పు, కూరగాయలతో మీరు…