బస్సుల్లో ప్రయాణించే మహిళలకు ధరలో 50 శాతం డిస్కౌంట్ ప్రకటించింది మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ.
ఈనెల 17 నుంచి ఈ రాయితీ అమల్లోకి వస్తుందని తెలిపింది.
గత సం. 75వ స్వాతంత్ర్య దినోత్సవాలను పురస్కరించుకుని 75 ఏండ్లు నిండిన సీనియర్ సిటిజన్లందరికీ ఎంఎస్ఆర్టీసీ టికెట్ రేటులో వంద శాతం రాయితీ ఇచ్చింది. అలాగే 65 నుంచి 74 ఏండ్ల మధ్య ఉన్నవారికి కూడా 50 శాతం డిస్కౌంట్ ఇచ్చింది.