రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ఫంక్షన్‌ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ కేంద్రమంత్రులు అధ్వర్యంలో కన్నుల పండువగా జరిగింది.

తొలివిడతలో 54 మందికి రాష్ట్రపతి ద్రౌపదిముర్ము అవార్డులను ప్రధానం చేశారు.

రాజకీయ రంగంలో చేసిన సేవలకు మాజీ కేంద్రమంత్రి ఎస్‌ఎం కృష్ణకు పద్మవిభూషణ్‌ అవార్డు.

ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారమంగళం బిర్లాకు పద్మభూషణ్‌ అవార్డు.

సామాజిక సేవారంగంలో తెలంగాణకు చెందిన కమలేశ్‌ డి పటేల్‌కు పద్మభూషణ్‌ అవార్డు.

అదే రంగంలో ఏపీకి చెందిన సంకురాత్రి చంద్రశేఖర్‌ పద్మభూషణ్‌ అవార్డు.

శాస్త్రసాంకేతిర రంగాల్లో తెలంగాణకు చెందిన విజయ్‌ గుప్తాకు పద్మశ్రీ అవార్డు.

తెలంగాణకు చెందిన సాహితివేత్త రామకృష్ణారెడ్డికి, డాక్టర్‌ హనుమంతరావుకు పద్మశ్రీ అవార్డు.

ఏపీకి చెందిన చింతలపాటి వెంకటపతిరాజుకు, సచ్చిదానంద శాస్త్రికి కూడా పద్మశ్రీ అవార్డు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు.